News August 19, 2024
రాఖీ పండుగ.. KTR భావోద్వేగం

TG: రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమె జైలుకు వెళ్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
Similar News
News November 20, 2025
పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబార ఘట్టం

పల్నాటి వీరాధనోత్సవాల్లో గురువారం రాయబార ఘట్టాన్ని నిర్వహించారు. సుమారు 7 సంవత్సరాలు 6 నెలలుగా అరణ్యవాసంలో ఉన్న మాచర్ల రాజ్యమంది తిరిగి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని బ్రహ్మన్న మళ్లీ దేవరాజులు అనుకునే సంఘటనగా ఆచారవంతులు ప్రతిబింబించగా, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలతో (వీరుల ఆయుధాలు) గ్రామోత్సవం ఘనంగా జరిగింది.
News November 20, 2025
గంభీర్పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్కతా పిచ్ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


