News March 17, 2024
బండారు సీటు కోసం టీడీపీ శ్రేణుల ర్యాలీ

పెందుర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సబ్బవరంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని, పొత్తులో భాగంగా ఈ సీటును బండారి కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మేరకు టీడీపీ నాయకులు, బండారు అనుచరులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
Similar News
News October 15, 2025
ఈనెల 17న కంచరపాలెంలో జాబ్ మేళా

కంచరపాలెం ఉపాధి కల్పనా కార్యాలయంలో అక్టోబర్ 17న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన వారు అర్హులు.ఈ జాబ్ మేళాలో మొత్తం 8కంపెనీలు పాల్గొనున్నాయి. అభ్యర్థులు తమ వివరాలను https://employment.ap.gov.in and https://www.ncs.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. ఆరోజు ఉదయం 10గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
News October 15, 2025
పెందుర్తిలో 6.8కేజీల గంజాయి పట్టివేత

విశాఖ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం నిర్వహించిన పెట్రోలింగ్లో పెందుర్తి రైల్వే స్టేషన్ వెలుపల అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ప్రకాశం జిల్లాకు చెందిన కువ్వరపు వినీల్ కుమార్, షేక్ సలీం అనే ఇద్దరు వ్యక్తులు రూ.40వేలు విలువ గల 6.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను పెందుర్తి ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.