News November 19, 2024

రామ్ చరణ్ అన్ని మతాల్ని గౌరవిస్తారు: ఉపాసన

image

అయ్యప్ప మాలధారణలో దర్గాకు వెళ్లడమేంటంటూ నటుడు రామ్ చరణ్‌పై నెట్టింట పలువురు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు ఆయన భార్య ఉపాసన ట్విటర్‌లో జవాబిచ్చారు. ‘విశ్వాసం అనేది అందర్నీ కలిపి ఉంచేదే తప్ప విడదీసేది కాదు. భారతీయులు అన్ని దారులూ దేవుడి వద్దకే అని భావించి గౌరవిస్తారు. మన బలం ఐక్యతలోనే ఉంది. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాల్ని గౌరవిస్తారు’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 8, 2026

ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

image

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.

News January 8, 2026

ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

image

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్‌కు ఎంపిక చేయకుండా ఫూలిష్‌గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.

News January 8, 2026

రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

image

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్‌తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.