News April 7, 2025

అబుదాబిలో ఘనంగా రామనవమి వేడుకలు

image

అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నవమి వేడుకలతో పాటు స్వామి నారాయణ జయంతి సందర్బాన్ని ఆలయ నిర్వాహకులు అద్భుతంగా జరిపించారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న భక్తులు వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారని వారు తెలిపారు. రామ భజనలతో జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, హైందవ విలువలకు, శాంతి-ఐక్యతకు కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

రోడ్డు దాటేటప్పుడు మొబైల్ వాడొద్దు: వరంగల్ పోలీస్

image

రోడ్లు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగంపై పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్‌పై కేవలం ఒక్క సెకను దృష్టి మళ్లినా ప్రమాదాలకు దారితీయవచ్చని అధికారులు సూచించారు. రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ను పూర్తిగా పక్కన పెట్టి జాగ్రత్తగా నడవాలని తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా పౌరులకు విజ్ఞప్తి చేశారు.

News November 22, 2025

పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

image

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.

News November 22, 2025

పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

image

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.