News February 17, 2025
రంజాన్ మాసం: సా.4 గంటల వరకే ఆఫీస్

TG: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. మార్చి 2 నుంచి 31 వరకు వారంతా సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లకు ఇది వర్తించనుందని తెలిపింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీలోనూ ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.
Similar News
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT
News December 10, 2025
మహిళలు టూర్లకు ఎక్కువగా ఎందుకు వెళ్లాలంటే?

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇప్పుడు సోలోగా ట్రిప్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మన సమాజంలో వస్తున్న ఓ పెద్ద మార్పు. మహిళలు టూర్లకు వెళ్లడం వల్ల ఎంపవర్మెంట్, ఫ్రీడమ్, పర్సనల్ గ్రోత్, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం మెరుగవడం, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం, కొత్త బంధాలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు టూర్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.


