News November 16, 2024

రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు

image

AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు స్వగ్రామం నారావారిపల్లెలో జరుగుతాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఇక్కడకు రానున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు, నందమూరి కుటుంబసభ్యులు కూడా వస్తారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

image

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.

News January 19, 2026

సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని<> ICAR<<>>-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో 3 పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PhD(అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), పీజీ అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. RAకు గరిష్ఠ వయసు 40(M) కాగా, మహిళలకు 45ఏళ్లు. కంప్యూటర్ ఆపరేటర్‌కు 27ఏళ్లు. వెబ్‌సైట్: www.icar-crida.res.in

News January 19, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.