News June 26, 2024

రాష్ట్ర కార్యక్రమంగా రామోజీ సంస్మరణ సభ

image

AP: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. విజయవాడలోని కానూరులో గురువారం నిర్వహించబోయే ఈ సభకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. మీడియా, సినీ రంగాలకు రామోజీ చేసిన విశేష సేవలకు గాను ఆయన గౌరవార్థం రాష్ట్ర కార్యక్రమంగా సభను నిర్వహిస్తున్నట్లు GOVT పేర్కొంది.

Similar News

News November 23, 2025

రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి?

image

భారత్‌లో రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి? అనే సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. టీ, బాయిల్డ్ ఎగ్, చిన్న సమోసా, సిగరెట్, లోకల్ ట్రైన్ టికెట్, చిప్స్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్, పెన్సిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రూ.10కి కొనగలిగే బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.

News November 23, 2025

మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

image

ప్రేమ, తృప్తి, త్యాగం, నిగ్రహం.. ఈ సత్కర్మలే మనిషిని జీవింపజేస్తాయి. మంచి మనిషి అనే పేరు తెస్తాయి. అసూయ, అత్యాశ, ద్వేషం, పగ వంటి దుష్కర్మలు మనిషిని దహింపజేస్తాయి. ఇవి ఉన్న మనిషి బతికున్న శవం వంటివాడు. అధికారం, అహంకారం, ఆనాలోచనలు జీవితానికి చెరుపు తెస్తాయి. అప్పు, యాచన ఎప్పుడూ చేయకూడదు. లక్ష్యం, సహనం, వినయం, విధేయత వంటి సద్గుణాలతో జీవించి, వ్యామోహం, స్వార్థం వదిలితేనే ఉత్తమ కర్మఫలాన్ని పొందుతాం.

News November 23, 2025

‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.