News April 10, 2025
ఇండియాకు రాణా.. NIA స్టేట్మెంట్ రిలీజ్

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.
Similar News
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.
News January 23, 2026
బ్రెజిల్తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.


