News April 10, 2025
ఇండియాకు రాణా.. NIA స్టేట్మెంట్ రిలీజ్

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.
Similar News
News January 26, 2026
RD వేడుకలు.. PM మోదీ షేర్ చేసిన అద్భుత చిత్రాలు

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. భారత రక్షణ దళాలు చేసిన విన్యాసాలు, కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికుల మార్చ్ ఫాస్ట్, గుర్రాలు, ఒంటెలతో తీసిన ర్యాలీలు, వివిధ రాష్ట్రాల శకటాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను ప్రధాని మోదీ ‘X’ వేదికగా పంచుకున్నారు.
News January 26, 2026
అంబేడ్కర్ యూనివర్సిటీలో 53పోస్టులకు నోటిఫికేషన్

ఆగ్రాలోని <
News January 26, 2026
రేపు మధ్వనవమి.. ఎందుకు జరుపుతారంటే?

ద్వైత సిద్ధాంతకర్త, వాయుదేవుని మూడో అవతారమైన మధ్వాచార్యులు భౌతిక దేహంతో బదరీ క్షేత్రానికి పయనమైన పవిత్ర దినమే మధ్వనవమి. మాఘ శుక్ల నవమి నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో శిష్యులకు పాఠం చెబుతుండగా పుష్పవృష్టి కురిసి అదృశ్యమయ్యారు. హరియే సర్వోత్తముడని చాటిచెప్పిన ఆయన స్మరణార్థం నేడు మధ్వనవమి జరుపుకొంటాం. లోకానికి జ్ఞాన, భక్తి మార్గాలను అందించిన మహనీయుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తారు.


