News April 10, 2025

ఇండియాకు రాణా.. NIA స్టేట్‌మెంట్ రిలీజ్

image

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.

Similar News

News April 18, 2025

జాట్ మూవీ టీంపై కేసు నమోదు

image

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

News April 18, 2025

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్‌పూర్‌కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.

News April 18, 2025

బంగ్లాదేశ్ నీతులు చెప్పడం మానాలి: విదేశాంగ శాఖ

image

భారత్‌కు నీతులు చెప్పడం మాని తమ దేశంలోని మైనారిటీలను కాపాడాలని బంగ్లాదేశ్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చడానికి భారత్‌ను బంగ్లాదేశ్ విమర్శిస్తోందని ఆరోపించారు. కాగా బెంగాల్‌‌‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మరణించారు. దీంతో భారత్‌లోని మైనారిటీ ముస్లింలను కాపాడాలని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది.

error: Content is protected !!