News March 29, 2024
కూతురికి రణ్బీర్-అలియా రూ.250 కోట్ల గిఫ్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురు రాహాపై ఉన్న ప్రేమను తెలిపేందుకు తాను ముంబైలో నిర్మిస్తోన్న కొత్త బంగ్లాను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయనున్నారట. రణబీర్, అలియా ఇద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును ఈ ఇంటిపై సమానంగా పెట్టుబడి పెడుతున్నారు. ఇంటికి రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుండగా.. ఆమె పేరిట రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిచెస్ట్ స్టార్ కిడ్గా మారనుంది.
Similar News
News November 19, 2025
సేవలు – ధరలు – ఇతర వివరాలు

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.
News November 19, 2025
అందుకే ఫైరింగ్ జరగలేదు!

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.


