News September 18, 2024
SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా గోపాల్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్గా రిటైర్డ్ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.
Similar News
News January 20, 2026
సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలంటే?

సీడ్ సైక్లింగ్లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వ రోజు నుండి పీరియడ్స్ మొదటి రోజు వరకు రోజుకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి.
News January 20, 2026
మెగా హీరోతో మారుతి మూవీ.. క్లారిటీ!

డైరెక్టర్ మారుతి తర్వాతి మూవీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో మెగా హీరోతో చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. మారుతి తర్వాతి సినిమాపై అధికారికంగా ప్రకటన చేస్తామని పేర్కొంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.
News January 20, 2026
CRPF పురుషుల బృందాన్ని నడిపించనున్న మహిళా అధికారి!

రిపబ్లిక్ డే కవాతులో చరిత్ర సృష్టించేందుకు CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా(26) సిద్ధమవుతున్నారు. J&Kకు చెందిన ఈ అధికారి తమ పురుష దళానికి నాయకత్వం వహించనున్నారు. CRPFలో 140 మందితో కూడిన మేల్ కమాండ్ను లేడీ ఆఫీసర్ లీడ్ చేయడం ఇదే తొలిసారి. రాజౌరి(D) నుంచి ఆఫీసర్ ర్యాంకులో చేరిన తొలి మహిళ కూడా బాలానే కావడం విశేషం. 2020లో ఆర్మీ డే పరేడ్ను లీడ్ చేసిన మొదటి మహిళగా తానియా షేర్ గిల్ నిలిచారు.


