News April 2, 2025
RTC ఉద్యోగుల పిల్లలకు ర్యాంకులు.. సజ్జనార్ సన్మానం

TG:గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన TGSRTC ఉద్యోగుల పిల్లలను సంస్థ MD సజ్జనార్ సన్మానించారు. గ్రూప్-1 రిజల్ట్స్లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ శ్రీనివాస్ కుమార్తె వీణ 118వ ర్యాంక్, TI-2గా పనిచేస్తున్న వాహిద్ కుమార్తె ఫాహిమినా 126వ ర్యాంక్, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ పుష్పలత కుమారుడు రాఘవేందర్ 143వ ర్యాంకులు సాధించారు. RTC ఉద్యోగుల పిల్లలు రాణించడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.
Similar News
News January 20, 2026
TN గవర్నర్ వాకౌట్కు కారణాలివే: లోక్భవన్

TN అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేయడానికి గల కారణాలను లోక్భవన్ వెల్లడించింది. ‘గవర్నర్ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్రోఫోన్ ఆఫ్ చేశారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు, ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయి. నేరాల పెరుగుదల, 55% పెరిగిన POCSO కేసులు, 33% పెరిగిన లైంగిక వేధింపుల వంటి అనేక సమస్యలను ప్రసంగంలో ప్రస్తావించలేదు’ అని స్టేట్మెంట్లో పేర్కొంది.
News January 20, 2026
మూవీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

TG: సినిమా టికెట్ ధరల <<18819916>>పెంపుపై<<>> తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. MSVPG టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయమై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, <<18817219>>సీవీ ఆనంద్<<>>కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇకపై మూవీ టికెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
News January 20, 2026
రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.


