News April 29, 2024
రేప్ చేసి.. రాడ్డుతో ముఖంపై పేరు రాసి

UPలోని లఖీంపుర్ ఖేరీలో అమన్(22) ఓ యువతిని(17) ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఈనెల 19న బంధించి 3రోజులు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. ఎట్టకేలకు బాధితురాలు ఆ చెర నుంచి బయటపడటంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అతడు HYDలోని ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 23, 2025
KCR, హరీశ్కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. మాజీ CM KCRతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు SIT నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో చెప్పారని తెలుస్తోంది. దీంతో KCR, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత HYD CP సజ్జనార్ నేతృత్వంలోని SIT నోటీసులు ఇవ్వనుంది.
News December 23, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,400 పెరిగి రూ.1,38,550కు చేరింది. రెండ్రోజుల్లోనే రూ.4,370 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,200 ఎగబాకి రూ.1,27,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,34,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 23, 2025
₹8 కోట్ల ఆన్లైన్ మోసం.. తుపాకీతో కాల్చుకుని మాజీ IPS ఆత్మహత్య

సైబర్ మోసానికి మాజీ IPS బలయ్యారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు పంజాబ్కు చెందిన అమర్ చాహల్(Ex IG)ను నమ్మించారు. ఆయనతో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయించారు. ఈ క్రమంలో ఆయన రూ.8 కోట్లు మోసపోయారు. తీవ్ర ఆవేదనతో పటియాలాలోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని సూసైడ్ నోట్లో కోరారు.


