News August 14, 2025

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

image

TG: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI-2025’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Similar News

News August 14, 2025

భారత్‌పై ట్రంప్ వైఖరి తప్పు: US Ex NSA

image

భారత్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోల్టన్ తప్పుబట్టారు. ‘రష్యా ఆయిల్ కొంటున్నారన్న సాకుతో ఇండియాపై 25%(ఓవరాల్ 50%) అదనపు టారిఫ్స్ వేయడం తప్పు. చైనాకు ఎందుకు అలాంటి సుంకాలు విధించలేదు? ట్రంప్ చర్యలతో అమెరికా మళ్లీ భారత్ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. నా సలహా ఏంటంటే.. భారత్ కూడా పాక్‌లా ట్రంప్‌ని నోబెల్‌ కోసం సిఫార్సు చేయాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు.

News August 14, 2025

ట్రంప్ టారిఫ్స్‌కు బ్రెజిల్ కౌంటర్ ప్లాన్స్

image

బ్రెజిల్‌పై US అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్స్‌కు ఆ దేశ అధ్యక్షుడు లూలా కౌంటరిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. టారిఫ్స్‌తో ఎఫెక్ట్ అయిన దేశాధినేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జిన్‌పింగ్, మోదీలాంటి నేతల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. టారిఫ్స్‌తో నష్టపోతున్న వారి ఎగుమతిదారులకు 5.5 బి. డాలర్ల క్రెడిట్ లైఫ్‌లైన్, చిన్న పరిశ్రమలకు ట్యాక్స్ క్రెడిట్స్ ప్రకటించారు.

News August 14, 2025

IMPS చెల్లింపులపై ఛార్జీలు పెంపు: SBI

image

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) చెల్లింపులపై ఛార్జీలను పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీల్లో మార్పులేదు. ఆన్‌లైన్‌లో 25 వేలు-రూ.లక్షలోపు రూ.2, రూ.లక్ష-2 లక్షలలోపు రూ.6, రూ.2 లక్షల-రూ.5 లక్షలలోపు రూ.10 ఛార్జీలు+GST చెల్లించాలి. శాలరీ అకౌంట్స్‌ను మినహాయించారు. కార్పొరేట్ కస్టమర్లకు ఇవి SEP 8 నుంచి అమలులోకి రానున్నాయి.