News January 26, 2025
టీ20ల్లో అరుదు

SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్కు దూసుకెళ్లింది.
Similar News
News September 17, 2025
ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. APPLY

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <
News September 17, 2025
అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్లో విలీనం చేశారని చెప్పారు.
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.