News September 21, 2024
రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు

ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
Similar News
News November 18, 2025
‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.
News November 18, 2025
‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.
News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.


