News April 10, 2025
30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

TG: పేదలకు సన్నబియ్యం న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే సన్నబియ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి MLA తమ నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించాలని సూచించారు. త్వరలోనే 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
Similar News
News April 3, 2026
ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య పెంచడం కష్టమే: అరుణ్ ధుమాల్

ఐపీఎల్ మ్యాచ్లను పెంచాలన్న డిమాండ్లపై ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ల సంఖ్యను 84 లేదా 94కు పెంచడం అనేది అంతర్జాతీయ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుత విండోలోనే (MAR-MAY) మ్యాచ్లు పెంచాలంటే డబుల్ హెడర్స్ ఎక్కువవుతాయని.. ఇది బ్రాడ్కాస్టర్లకు అంతగా నచ్చదన్నారు. ద్వైపాక్షిక సిరీస్లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో వాటి సంఖ్య తగ్గిస్తే ఐపీఎల్ మ్యాచ్లు పెంచుకోవచన్నారు.
News April 3, 2026
రెండేళ్లుగా సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

TG: గత రెండేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. 2025-26లో 72 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తి 58MTకే పరిమితమైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 16% తక్కువ. FY25లోనూ 72MT టార్గెట్ అయితే 69MTనే ఉత్పత్తి చేసింది. భారీ వర్షాలు, మార్కెట్లో లో గ్రేడ్ బొగ్గుకు డిమాండ్ తగ్గడం, సంస్థ బొగ్గు ధరలను పెంచడం, కొత్త గనుల మంజూరులో జాప్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.
News April 3, 2026
ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన


