News August 11, 2024
కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు!

AP: రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 89 లక్షల కార్డులకు కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది.
Similar News
News January 18, 2026
చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.
News January 18, 2026
2027 సంక్రాంతికి లైన్లో చిరు, రజినీకాంత్!

2027 సంక్రాంతి సినిమాలపై చర్చ అప్పుడే మొదలైంది. ‘MSVPG’తో హిట్ అందుకున్న చిరంజీవి వచ్చే సంక్రాంతికి మరో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో తేజా సజ్జ ‘జాంబిరెడ్డి 2’తో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్, కామెడీ జానర్ సినిమాతో శర్వానంద్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్తో అనిల్ రావిపూడి, కొత్త సినిమాతో రజినీకాంత్ సంక్రాంతి బాక్సాఫీస్పై కన్నేశారు.
News January 18, 2026
జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.


