News February 13, 2025
రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!

TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News March 10, 2026
గ్యాస్ సరఫరాలో వీటికే ప్రయారిటీ: ఆయిల్ సంస్థలు

గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం నేపథ్యంలో గ్యాస్ కొరతపై ఇండియన్, HP, భారత్ పెట్రోలియం సంస్థలు కీలక ప్రకటన చేశాయి. డొమెస్టిక్ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సెక్టార్స్కు ప్రయారిటీ ప్రకారం సప్లై చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మిగతా నాన్-డొమెస్టిక్ సెక్టార్స్ నుంచే వచ్చే విజ్ఞప్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ పరిశీలించి సరఫరా చేస్తామని వెల్లడించాయి.
News March 10, 2026
తల్లి, చెల్లిని దూషించే సంస్కృతి పోగొట్టేలా!

మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మహారాష్ట్రలోని కొల్గావ్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గొడవల్లో తల్లి, చెల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషిస్తే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించింది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కఠిన నిబంధనలు అన్నిచోట్లా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం అసభ్య సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మీ కామెంట్?
News March 10, 2026
ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది!

గ్యాస్ ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు. పప్పు, బియ్యాన్ని ఓ అరగంట నానబెడితే త్వరగా ఉడుకుతాయి. ప్రెషర్ కుక్కర్ & పెద్ద పాత్రలు వాడండి. గిన్నెపై మూత పెట్టండి. ఆవిరి రూపంలో గ్యాస్ వృథా కాకుండా సిమ్లో పెట్టండి. వంటకు అవసరమైన నీరే పోయండి. తరచూ బర్నర్లను క్లీన్ చేయండి. ఫ్రిజ్లో ఉంచిన వాటిని వెంటనే వేడి చేయొద్దు. ఒకేసారి రెండు పూటలకు సరిపడా వంట చేసుకోండి. వంట పూర్తయ్యే 2 ని.ల ముందే ఆఫ్ చేసి మూతపెట్టండి.


