News January 29, 2025

రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఉండాలి: బండి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, కార్డులపై మోదీ ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు.

Similar News

News March 14, 2025

నేడు గ్రూప్-3 ఫలితాలు

image

TG: నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను TGPSC ప్రకటించింది.

News March 14, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

image

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.

News March 14, 2025

కాల్పుల విరమణకు పుతిన్ ఒకే.. కానీ

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 30 రోజుల పాటు <<15729985>>కాల్పుల విరమణకు<<>> రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణకు అనుకూలమేనని అంటూ చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మధ్యవర్తిత్వం చేస్తున్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి మాట్లాడుతామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా ముగించే ఆలోచనకు మద్దతిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!