News December 11, 2024

రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా: జగన్

image

AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News October 22, 2025

ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

image

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్‌లో 29, సెకండియర్‌లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్‌లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.

News October 22, 2025

పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

image

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్‌ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 22, 2025

స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్‌గేట్స్

image

హిందీ టీవీ సీరియల్ ‘క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ’లో లీడ్ రోల్‌లో బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్, నవజాత శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా స్మృతి, గేట్స్ మధ్య వీడియో కాల్ కాన్వర్జేషన్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తైందని, 3 ఎపిసోడ్స్‌లో ఆయన కనిపిస్తారని తెలిసింది.