News May 22, 2024

రైల్లో లగేజీ కొరికేసిన ఎలుకలు.. ప్రయాణికుడి ఆవేదన

image

ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్న వ్యక్తికి సంబంధించిన లగేజీని ఎలుకలు కొరికేయడం నెట్టింట చర్చనీయాంశమైంది. సదరు ప్రయాణికుడు రైల్వేను ట్యాగ్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేసేందుకు కూడా అధికారులెవరూ లేరని వివరించారు. అతడి పోస్టు వైరల్ కావడంతో స్పందించిన రైల్వే సేవ పూర్తి వివరాలను పంపించాలని కోరింది. రైళ్ల నిర్వహణలో లోపాలపై ఇటీవలి కాలంలో నెట్టింట తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News November 28, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్‌లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్

News November 28, 2025

సర్పంచ్ పోస్టు@రూ.కోటి

image

TG: సర్పంచ్ పదవులను <<18400001>>ఏకగ్రీవంగా<<>> సొంతం చేసుకునేందుకు వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్(D) టంకర్ గ్రామ పంచాయతీని ఓ వ్యాపారి ₹కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల(D) కొండపల్లిలో ₹60L, గొర్లఖాన్‌దొడ్డిలో ₹57L, చింతలకుంటలో ₹38L, ముచ్చోనిపల్లిలో రూ.14.90L, ఉమిత్యాల తండాలో ₹12L చొప్పున సర్పంచ్ సీటుకు వేలంపాట పాడారు.

News November 28, 2025

4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

image

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్‌ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.