News June 30, 2024
సీబీడీటీ ఛైర్మన్గా రవి అగర్వాల్

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సీబీడీటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. SEP 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత ఛైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది.
Similar News
News January 21, 2026
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

సరైన జీవనశైలితో అనారోగ్యాన్ని 90శాతం వరకూ దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 3-4 సార్లు వ్యాయామం, ప్రతిరోజూ 10 వేల అడుగుల నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ‘సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. పోషకాహారం తీసుకోవడం, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెబుతున్నారు. share it
News January 21, 2026
జగన్ పాదయాత్ర YCPని అధికారంలోకి తెస్తుందా?

AP: గతంలో కలిసొచ్చిన పాదయాత్రనే జగన్ మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 3,600kmపైగా నడిచిన ఆయన 151 సీట్లతో గెలిచారు. ఈసారి ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రజల్లోకి వెళ్లి కూటమి పాలనను ఎండగట్టడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతున్న వేళ జగన్ ఆ ఫార్ములాతోనే మళ్లీ సీఎం అవుతారని అనుకుంటున్నారా?
News January 21, 2026
RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://rgssh.delhi.gov.in


