News June 30, 2024

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సీబీడీటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. SEP 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత ఛైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది.

Similar News

News December 27, 2025

HEADLINES

image

* రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ.. CM CBN వార్నింగ్
* తెలంగాణ కోసం పోరాడేది BRS మాత్రమే: KCR
* డబుల్ ఇంజిన్ సర్కారుతోనే TG అభివృద్ధి: కిషన్ రెడ్డి
* మా అయ్య మగాడు, మొనగాడు.. రేవంత్‌కు KTR కౌంటర్
* త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు: AP మంత్రి డోలా
* భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
* 3వ టీ20లో శ్రీలంక ఉమెన్స్ టీమ్‌పై భారత్ విజయం.. సిరీస్ కైవసం

News December 27, 2025

స్వేచ్ఛనిస్తే మళ్లీ బీజేపీలోకి..: రాజాసింగ్

image

TG: తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఓ అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సిందే అని అన్నారు. అలాగే తాను కూడా రీఎంట్రీ ఇస్తాననే హింట్ ఇచ్చారు.

News December 27, 2025

‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

image

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.