News June 30, 2024

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సీబీడీటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. SEP 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత ఛైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది.

Similar News

News September 20, 2024

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

image

AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.

News September 20, 2024

ప్చ్.. మళ్లీ తక్కువ రన్స్‌కే ఔటైన రోహిత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో జాకీర్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్‌కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

News September 20, 2024

నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు

image

ద‌లాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. గ్లోబ‌ల్ మార్కెట్స్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం జీవిత‌కాల గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వ‌ద్ద‌, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.