News September 26, 2024
R&B అధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ

విజయవాడలోని R&B ఈఎన్సీ కార్యాలయంలో CM చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల అప్ గ్రేడేషన్కు సంబంధించి గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. భూసేకరణ సమస్యలు, అటవీ క్లియరెన్స్, తదితర సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ, వారికి దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 11, 2025
పోలీస్ పిజిఆర్ఎస్ కు 122 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట వద్ద ఉన్న సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
News March 10, 2025
కర్నూలు జిల్లాలో 349 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు 349 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 18,481 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 18,132 మంది హాజరయ్యారు. 349 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదు.
News March 10, 2025
సమస్యలను పరిష్కరించండి: కర్నూలు జిల్లా కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా తీసుకున్న అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ బి.నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు.