News September 13, 2024

బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక

image

కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE) ప్రాజెక్టులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. షార్ట్ సెల్లర్లకు ఇది లక్ష్యంగా మారొచ్చని హెచ్చరించారు. ‘లోన్‌బుక్స్‌లో అధిక CRE రేషియో వల్ల అంచనా వేయగలిగే, వేయలేని CRE నష్టాలతో బ్యాంకులకు ఇబ్బందే. వీటితో లిక్విడిటీ ఆగిపోతే షార్ట్ సెల్లర్లు టార్గెట్ చేస్తారు. దాంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత తగ్గుతుంది’ అని అన్నారు.

Similar News

News December 8, 2025

జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్‌‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.

News December 8, 2025

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News December 8, 2025

ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

image

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.