News October 9, 2024
RBI MPC: FY25లో రియల్ జీడీపీ గ్రోత్ 7.2%
FY25లో భారత రియల్ జీడీపీ గ్రోత్ను 7.2 శాతంగా RBI అంచనా వేసింది. Q1లో 8 కోర్ ఇండస్ట్రీస్ ఔట్పుట్ 1.8% తగ్గినట్టు తెలిపింది. కరెంటు, కోల్, సిమెంట్ ఉత్పత్తిపై అధిక వర్షపాతం ప్రభావం చూపినట్టు పేర్కొంది. ఇన్ఫ్లేషన్ గుర్రాన్ని కట్టడి చేశామని, కళ్లెం విప్పేముందు జాగ్రత్తగా ఉండాలంది. FY25లో ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్పింది. ఎమర్జింగ్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉన్నట్టు వెల్లడించింది.
Similar News
News October 9, 2024
హైదరాబాద్లో ఉద్రిక్తత.. MRPS ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
TG: HYDలోని పార్శీగుట్ట ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో పాటు నేతలు నిరసనకు దిగారు. పార్శీగుట్ట నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
News October 9, 2024
ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR
AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
News October 9, 2024
యూపీఐ వాలెట్, ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను మరింత ప్రోత్సహించేలా UPI వాలెట్ పరిమితిని రూ. 2000 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రతి లావాదేవీకి UPI పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి, UPI 123పే లావాదేవీల లిమిట్ను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు UPI వాలెట్, ఫీచర్ ఫోన్లు వాడే వారి కోసం యూపీఐ123పే ఉపయోగపడుతుంది.