News March 30, 2024
అరుదైన రికార్డును సాధించిన RCB

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 1500 సిక్సులు బాదిన రెండో టీమ్గా RCB నిలిచింది. ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఈ మ్యాచ్లో కోహ్లీతో పాటు గ్రీన్ చెరో రెండు సిక్సులు బాదారు. మరి ఈ మ్యాచ్లో ఎన్ని సిక్సులు నమోదవుతాయో కామెంట్ చేయండి.
Similar News
News February 8, 2026
మున్సిపల్ ఎన్నికలు.. వైన్స్, బార్లు బంద్

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ వైన్స్, బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
News February 8, 2026
పసికూనల పోరాటం అదుర్స్

T20WCలో పసి కూనలనుకున్న దేశాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విజయాలు సాధించకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాయి. నెదర్లాండ్స్పై పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. WIపై స్కాట్లాండ్ 35 రన్స్ తేడాతో ఓడింది. INDపై USA 29 రన్స్ తేడాతో ఓడిపోయింది. తాజాగా ENGపై నేపాల్ గెలిచినంత పని చేసి నాలుగే రన్స్ తేడాతో ఓడింది. గెలవాలన్న కసితో ఈ జట్లు ఆడిన తీరు క్రికెట్ అభిమానులను మెస్మరైజ్ చేసింది.
News February 8, 2026
పాక్ ఏజెంట్తో గొగొయ్కి సంబంధాలు: CM

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్తో గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.


