News March 30, 2024

అరుదైన రికార్డును సాధించిన RCB

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 1500 సిక్సులు బాదిన రెండో టీమ్‌గా RCB నిలిచింది. ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీతో పాటు గ్రీన్ చెరో రెండు సిక్సులు బాదారు. మరి ఈ మ్యాచ్‌లో ఎన్ని సిక్సులు నమోదవుతాయో కామెంట్ చేయండి.

Similar News

News February 12, 2026

ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

image

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్‌ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్‌లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.

News February 12, 2026

టాస్ గెలిచిన నమీబియా.. భారత్ బ్యాటింగ్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచులో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ దూరమయ్యారు. అతడి ప్లేస్‌లో సంజూ శాంసన్ వచ్చారు. సిరాజ్ స్థానంలో బుమ్రా ఆడనున్నారు.
IND: శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, రింకూ, హార్దిక్, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా

News February 12, 2026

రూ.55,649 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

image

రోజుకో రీతిలో సాగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు ₹వేలకోట్లు నష్టపోతున్నారు. గత 5 ఏళ్లలో 65,89,063 మంది బాధితులు ₹55,649 CR పోగొట్టుకున్నారు. ఈ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా ₹551 CR మోసపోయారు. అదే 2025లో 24,02,579లు కేసులు నమోదైతే మోసపోయిన సొమ్ము ₹22,495 CRకు చేరింది. కాగా 23.61 లక్షల కేసుల్లో ₹8189 కోట్లు కాపాడగలిగామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.