News January 22, 2025
భారత్ పిచ్పై తేలిపోయిన RCB బ్యాటర్లు!

టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
Similar News
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News January 24, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

గువాహటిలోని <
News January 24, 2026
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేశారు!

70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. ఛత్తీస్గఢ్లోని కోర్బాలో జరిగిందీ ఘటన. హస్దేవ్ లెఫ్ట్ కెనాల్పై 40ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. దాని బరువు 10 టన్నులపైనే ఉంటుంది. 15మంది కలిసి బ్రిడ్జిని కట్ చేసి, తుక్కు కింద అమ్మారని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.


