News March 18, 2024
రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం

ఆర్సీబీ మహిళల జట్టు WPL కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకు శుభాకాంక్షలు చెప్పే బదులు పురుషుల జట్టును ట్రోల్ చేసేలా రాజస్థాన్ రాయల్స్ ఓ ట్వీట్ చేసింది. పురుషులు చేయలేనిది మహిళలు చేశారన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. దానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
Similar News
News February 10, 2026
ఉలవ పంటలో కాయ ఈగ – నివారణకు సూచనలు

ఉలవ పంటను ఆశించే కాయ ఈగ అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. అందుకే కాయ లోపల జరిగే నష్టం మనకు కనిపించదు. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 50% ఇ.సి 2ML లేక థయోమిథాక్సామ్ 25% W.G 0.4గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
రేవంత్ మతం మార్చుకున్నా అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి

TG: ‘కిషన్ రావు’ అంటూ CM రేవంత్ చేసిన <<19085836>>విమర్శలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీరు పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేం నిప్పులు పోస్తాం. KCRకి నేను దత్తపుత్రుడినని విమర్శించారు. నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు’ అని ఢిల్లీ ప్రెస్మీట్లో మండిపడ్డారు.
News February 10, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


