News May 25, 2024
ఆర్ఆర్పై ఆర్సీబీ ఫ్యాన్స్ అసహనం

ఈ ఏడాది ఐపీఎల్లో నిన్నటి మ్యాచ్కు ముందు ఆడిన చివరి 6 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది ఒకే ఒక మ్యాచ్. ఆ ఒక్క మ్యాచ్ ఆర్సీబీపై ఎలిమినేటర్. నిన్న క్వాలిఫయర్-2లో SRH చేతిలో మళ్లీ ఓడింది. దీంతో RCB ఫ్యాన్స్ RRపై నెట్టింట మండిపడుతున్నారు. ‘అటు మీరు వెళ్లలేదు. ఇటు మమ్మల్ని వెళ్లనివ్వలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ RRపై RCB గెలిచి నిన్న SRHతో మ్యాచ్ ఆడి ఉంటే..? కామెంట్ చేయండి.
Similar News
News November 2, 2025
బిగ్బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

బిగ్బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News November 2, 2025
హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్లో నవీన్ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
News November 2, 2025
నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.


