News October 16, 2024
RCB ఫ్యాన్స్ అత్యంత విశ్వాసంగా ఉంటారు: అశ్విన్

RCB టీమ్ను, అభిమానుల్ని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. ఆ జట్టు అభిమానులు అత్యంత విశ్వాసం కలిగినవాళ్లని పేర్కొన్నారు. ‘ఆర్సీబీ ఫ్యాన్స్కు విరాట్ అంటే ప్రాణం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వాళ్లు నిరాశకు లోనవుతుంటారు. అయినా మద్దతును మాత్రం ఆపరు. RCBకి వారి ఫ్యాన్స్ దేవుడిచ్చిన వరం. గడచిన పదేళ్లలో అత్యంత స్థిరంగా ఆడుతున్న జట్టు ఆర్సీబీయే’ అని కొనియాడారు.
Similar News
News February 6, 2026
కల్తీ నెయ్యి కేసు.. చిన్నప్పన్నకు బెయిల్

AP: కల్తీ నెయ్యి కేసు నిందితుడు చిన్నప్పన్నకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ కూడా దాఖలైనందున పిటిషనర్ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో తనకు ఉన్న స్థిర, చరాస్తుల వివరాలతో ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలంది.
News February 6, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’ వల్ల కలిగే లాభాలేంటి?

కేంద్రం అమలు చేసే పథకాల లబ్ధి పొందాలంటే రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి. పెట్టుబడి సాయం ‘పీఎం కిసాన్’ అందాలన్నా, పంటల బీమా ‘ఫసల్ బీమా’ నిధులు జమ కావాలన్నా, ఎరువుల రాయితీలు, పంట రుణాలు పొందాలన్నా ఈ 11 అంకెల విశిష్ఠ నెంబర్ ఉండాల్సిందే. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి అమలయ్యే పథకాల లబ్ధిని అన్నదాతలు పొందాలన్నా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు.
News February 6, 2026
ఏపీ దళిత ఎంపీని కాంగ్రెస్ అవమానించింది: మోదీ

లోక్సభ స్పీకర్ ఛైర్లో కూర్చున్న ఏపీకి చెందిన దళిత ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను కాంగ్రెస్ సభ్యులు అవమానించారని PM మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్పై కాగితాలు విసిరేశారని మండిపడ్డారు. అలాగే అస్సాంకు చెందిన BJP MP దిలీప్ సైకియా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తించారని దుయ్యబట్టారు. వారికి దళితులపై చిన్నచూపు ఉందన్నారు.


