News September 29, 2024
RCB ఆ ఒకర్ని తప్ప అందర్నీ వదిలేయాలి: ఆర్పీ సింగ్
ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రెష్గా రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. విరాట్ను తప్ప అందర్నీ వదిలేయాలన్నారు. ‘కోహ్లీ జట్టుతోనే ఉండాలి. అతడి చుట్టూ టీమ్ నిర్మించాలి. మిగిలిన కీలక ఆటగాళ్లను RTMతో సొంతం చేసుకుంటే చాలు. సిరాజ్, పాటీదార్ వంటి కీలక ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయొచ్చు. ఆ జట్టులో ఇప్పుడున్న వారిలో విరాట్ తప్ప వేరెవ్వరూ రూ. 14-18 కోట్లు పలికే ఛాన్స్ లేదు’ అని తెలిపారు.
Similar News
News September 29, 2024
రాజ్యసభ రేసులో నాగబాబు?
AP: ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లూ NDAకే దక్కనున్నాయి. వీటిలో 2 TDP, ఒకటి JSP పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. TDP నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. BJP అధిష్ఠానం తమకూ ఓ సీటు అడగొచ్చని సమాచారం.
News September 29, 2024
ALERT: మరికాసేపట్లో భారీ వర్షం
TG: మరికాసేపట్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అత్తాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవనున్నట్లు అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
News September 29, 2024
ఆఫీసులో ఆగిన మరో గుండె.. టెకీ దుర్మరణం
పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్లోని HCL కార్యాలయం వాష్రూమ్లో టెకీ నితిన్ ఎడ్విన్(40) కుప్పకూలారు. సహచరులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లక్నోలోని HDFC బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సదాఫ్ ఫాతిమా, పుణేలో CA సెబాస్టియన్ పెరయిల్ ఇలాగే కన్నుమూశారు.