News March 25, 2024
RCB టార్గెట్ 177 రన్స్

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 176/6 స్కోర్ చేసింది. శిఖర్ ధవన్(45), ప్రభ్సిమ్రన్ సింగ్(25), సామ్ కరన్(23), జితేశ్ శర్మ(27) రాణించారు. బెంగళూరు గెలవాలంటే 177 రన్స్ చేయాలి. RCB బౌలర్లలో సిరాజ్ 2, మాక్స్వెల్ 2, దయాల్ 1, జోసెఫ్ 1 చొప్పున వికెట్లు తీశారు.
Similar News
News April 21, 2025
రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.
News April 21, 2025
KTRకు హైకోర్టులో ఊరట

TG: మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఆయనపై కేసు నమోదైంది.
News April 21, 2025
మతోన్మాద పార్టీతో INC, BRS దోస్తీనా?.. కిషన్ రెడ్డి మండిపాటు

TG: HYD స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో MIMకు మేలు చేసేలా INC, BRS వ్యవహరిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లీస్ పచ్చి మతోన్మాద, రజాకార్ల పార్టీ అని దుయ్యబట్టారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్కు దోస్తీనా అని నిలదీశారు. మజ్లీస్ను గెలిపించాలని సొంత పార్టీ కార్పొరేటర్లను BRS బెదిరిస్తోందని మండిపడ్డారు. BRSకు బాస్ KCR అయినా సూపర్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.