News May 20, 2024

ఆర్సీబీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు: దినేశ్ కార్తీక్

image

రాబోయే ఐపీఎల్ సీజన్లలో వెనకబడిన జట్లు ఆర్సీబీని చూసి స్ఫూర్తిని పొందుతాయని ఆ జట్టు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నారు. తొలి ఎనిమిది మ్యాచుల్లో ఒక్కటే నెగ్గినా.. తర్వాత వరుసగా ఆరు మ్యాచులు గెలుపొందడం అసాధారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణం తమకెంతో ప్రత్యేకమన్న ఆయన.. అభిమానులు ఆర్సీబీ జట్టును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అత్యుత్తమ ఫీల్డింగ్ కూడా తమ విజయాలకు కారణమని తెలిపారు.

Similar News

News November 9, 2025

మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

News November 9, 2025

ఇవన్నీ క్యాన్సర్ కారకాలే!

image

నిత్యం మనం ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. పదేపదే మరిగించే నూనె, ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్‌లు, క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న టీ కప్పులు వీటిలోకే వస్తాయంటున్నారు. ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, వాడిన నూనెను వాడకపోవడం వంటి వాటికి దూరంగా ఉంటే ఈ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు.

News November 9, 2025

రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

image

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.