News November 28, 2024

నాకు పంజాబ్ కంటే ఆర్సీబీయే బెటర్: లివింగ్‌స్టోన్

image

IPL వేలంలో తనను ఆర్సీబీ తీసుకోవడం పట్ల ఇంగ్లండ్ ఆటగాడు లివింగ్‌స్టోన్ హర్షం వ్యక్తం చేశారు. ‘బెంగళూరు ఫ్యాన్స్ చాలా అభిమానం చూపిస్తారు. అక్కడి స్టేడియం కూడా చిన్నది. నా ఆటతీరుకు పంజాబ్ కంటే ఆర్సీబీయే కరెక్ట్‌గా ఉంటుంది. మా జట్టు వేలం చాలా బాగా జరిగింది. మంచి ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వారిలో కొంతమంది నాకు సన్నిహితులే. విరాట్‌తో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

‘సెన్‌యార్‌’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్‌యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

News November 21, 2025

‘సెన్‌యార్‌’ తుఫాన్ – రైతులకు సూచనలు

image

‘సెన్‌యార్‌’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.

News November 21, 2025

ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

image

వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్‌ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్‌కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.