News October 2, 2024

సోషల్ మీడియాలో ఆర్సీబీ సరికొత్త మైలురాయి

image

సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త మైలురాయి అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. సీఎస్కే తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జట్టుగా RCB నిలిచింది. ప్రస్తుతం సీఎస్కేకు 16 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ముంబై (14.1M) కోల్‌కతా (6.4M), హైదరాబాద్ (4.4M), రాజస్థాన్ (4.4M), గుజరాత్ (4M), ఢిల్లీ (3.9M) పంజాబ్ (3.3M), లక్నో (3.2M) ఉన్నాయి.

Similar News

News October 11, 2024

నమ్కిన్ ప్యాకెట్ల మాటున రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా

image

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన‌ ₹5,620 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న‌లుగురిని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు లండ‌న్ ప‌రారైన‌ట్టు తెలుస్తోంది.

News October 11, 2024

CARTOON: స్వర్గంలో టాటాకు జంషెట్జీ స్వాగతం

image

రతన్ టాటాకు స్వర్గంలో తన ముత్తాత జంషెట్జీ, భారతరత్న జేఆర్డీ టాటా స్వాగతం పలుకుతారేమో. తాము నాటిన మొక్కను దశదిశలా వ్యాపింపజేసినందుకు ఆయన్ను అభినందిస్తారేమో. ‘నేను గర్వపడేలా చేశావు’ అని జంషెట్జీ చెబుతుండగా, జేఆర్డీ మురిసిపోతున్నట్లుగా ఉన్న ఓ కార్టూన్‌ అభిమానుల మనసుల్ని తాకుతోంది. టాటా గ్రూప్‌నకు జంషెట్జీ వ్యవస్థాపకుడు కాగా సంస్థను జేఆర్డీ కొత్త పుంతలు తొక్కించారు.

News October 11, 2024

ఆమె ఖాతాలో రూ.999 కోట్లు జమ.. చివరికి ఏమైందంటే?

image

బెంగళూరులో ఓ కాఫీ షాప్ ఓనర్ ప్రభాకర్ భార్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి ఏకంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో వారు ఆశ్చర్యంలో పడిపోయారు. అయితే 48 గంటల్లోనే అకౌంట్ అంతా ఖాళీ అవడమే కాకుండా ఫ్రీజ్ అయ్యింది. ఈ క్రమంలో అతను సాధారణ లావాదేవీలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని వాపోయాడు.