News April 11, 2025
సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.
Similar News
News April 18, 2025
18th Anniversary: IPL స్పెషల్ పోస్టర్

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమై నేటితో 18 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా IPL X హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘కలలు నిజమయ్యాయి.. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి’ అనే క్యాప్షన్తో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘18 ఏళ్ల IPL జర్నీపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండి?’ అని ఫ్యాన్స్ను కోరింది. COMMENT
News April 18, 2025
‘ఫ్రెంచ్ ఓపెన్’లో నాదల్కు సన్మానం

వచ్చే నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆరోజున తమ దేశపు ఆటగాడు, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్కు సన్మానం చేయాలని నిర్ణయించినట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గిల్లెస్ మోరెటాన్ ప్రకటించారు. ‘రోలాండ్ గారోస్లో నాదల్కు మరెవరూ సాటిలేరు. ఇక్కడ ఆయన 14 టైటిళ్లు గెలిచారు. ఈ ఏడాది టోర్నమెంట్ ఆడకపోయినా ఆయన మాతో ఉంటారు. ఫ్రెంచ్ ఓపెన్కు రఫా ఓ గొప్ప రాయబారి’ అని ఆయన తెలిపారు.
News April 18, 2025
IPL: అరేయ్ ఏంట్రా ఇది!

ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఇదే జట్ల మధ్య ఒక్క రోజు గ్యాప్తో ఎల్లుండి మరోసారి చండీగఢ్లో మ్యాచ్ ఉంది. ఈ షెడ్యూల్ చూసి క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. మధ్యలో ఉన్న ఆ ఒక్క రోజు కూడా ట్రావెలింగ్కు కేటాయించారు. దీంతో గ్యాప్ ఇవ్వకుండా అవే జట్లకు వరుసగా మ్యాచులు పెట్టడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.