News February 5, 2025

RCPM: అద్దెకొచ్చామంటూ.. బంగారం గొలుసు చోరీ

image

రామచంద్రపురం పట్టణం ఏడో వార్డు గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ కడియాల పార్వతమ్మ మెడలో గొలుసును మాస్కు ధరించిన ఆగంతకుడు మంగళవారం తస్కరించాడు. అద్దె ఇల్లు పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పార్వతి చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతమ్మను సీఐ వెంకటనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 20, 2025

ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

image

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.

News November 20, 2025

కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

image

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.

News November 20, 2025

KMR: NPYAD పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తులకు ఆహ్వానం

image

2025-26 సం.రానికి గాను జాతీయ యువత, కౌమార దశ అభివృద్ధి కార్యక్రమం NPYAD పథకం కింద ఆర్థిక సహాయమందించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా http://NGO darpan.gov.inలో నమోదు చేసుకొని యూనిక్ దర్పన్ ఐడి పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లో సంప్రదించాలన్నారు.