News February 5, 2025
RCPM: అద్దెకొచ్చామంటూ.. బంగారం గొలుసు చోరీ

రామచంద్రపురం పట్టణం ఏడో వార్డు గణేష్ నగర్లో నివాసం ఉంటున్న మహిళ కడియాల పార్వతమ్మ మెడలో గొలుసును మాస్కు ధరించిన ఆగంతకుడు మంగళవారం తస్కరించాడు. అద్దె ఇల్లు పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పార్వతి చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతమ్మను సీఐ వెంకటనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 4, 2025
NRPT: భయాందోళనకు గురిచేసేందుకే క్షుద్రపూజలు

కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజలు విద్యార్థులను భయాందోళన గురి చేసే అందుకే చేసి ఉంటారని పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇట్టి పూజలు చేసిన ఆకతాయిలకు పోలీసులు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాలను కొనసాగించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల్లో తల్లీకూతుళ్ల సమరం..!

ఖమ్మం జిల్లా: పెనుబల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన పోరు నెలకొంది. సర్పంచ్ పదవి కోసం తల్లి తేజావత్ సామ్రాజ్యం, కూతురు బానోతు పాప ప్రత్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. సొంత కుటుంబ సభ్యులే ఒకే పదవికి పోటీ పడుతుండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఆసక్తికరమైన పోరాటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News December 4, 2025
వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.


