News February 9, 2025
RCPM: అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణం టీడీపీ ఆఫీస్లో నియోజవర్గ ప్రజల నుంచి అభ్యర్థులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి అర్జీలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్జీదారులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల వెంటనే సమ్యలపై పనిచేయాలన్నారు. నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
నవంబర్లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పూర్తయిన వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులను బిల్లుల గురించి అడిగి, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 16, 2025
కర్నూలు ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం

కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం జరిగింది. విద్యదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.