News March 9, 2025
RCPM: కిలో చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద వ్యాపారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News October 26, 2025
పార్వతీపురం: రేపు వర్షాల కారణంగా గ్రీవెన్స్ రద్దు

పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరగబోయే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు గమనించి సమస్యలు తెలపడం కోసం పార్వతీపురం రావద్దని పేర్కున్నారు.
News October 26, 2025
తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 26, 2025
రేపు PGRS రద్దు: కలెక్టర్

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


