News March 9, 2025

RCPM: కిలో చికెన్ ఎంతంటే?

image

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద వ్యాపారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.

Similar News

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.

News November 24, 2025

గొల్లపల్లి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది. సోమవారం జరిగిన గృహప్రవేశం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ హాజరయ్యారు. పేదలకు సొంతింటి కల సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

News November 24, 2025

జగిత్యాల: నూతన డీఈ టెక్నికల్ అంజయ్య బాధ్యతలు

image

NPDCL జగిత్యాల విద్యుత్ శాఖలో ఎన్.అంజయ్య సోమవారం డీఈ (టెక్నికల్)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన అనంతరం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయనతో శాఖ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అంజయ్య నియామకంతో జిల్లాలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సహచర అభ్యర్థులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.