News March 16, 2025
RCPM: కిలో చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాలు పుంజుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 23, 2025
ఇల్లందకుంట రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కార్యదర్శి సుధాకర్, ఆలయ ఛైర్మన్ రామారావు కోరారు.
News December 23, 2025
బాంబులతో చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నారు.. ఇదే సాక్ష్యం: కేటీఆర్

TG: ఇసుక మాఫియా కోసం బాంబులతో చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ “చిట్టి నాయుడి” ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు’ అని Xలో ఫైరయ్యారు.
News December 23, 2025
ఆ ‘అధికారం’ ప్రజలదే.. మీరేమంటారు?

AP: అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. 30ఏళ్లు అధికారంలో ఉంటామని CMగా జగన్ పలుమార్లు చెప్పారు. కానీ 2024లో జనం ఓడించారు. 15ఏళ్లు పవర్ తమదేనని పవన్ కళ్యాణ్, లోకేశ్ ఇటీవల అంటున్నారు. YCPని శాశ్వతంగా అధికారానికి <<18642155>>దూరం<<>> చేస్తానని తాజాగా పవన్ అన్నారు. కానీ అధికారంలో ఎవరుండాలో నిర్ణయించే ‘అధికారం’ ప్రజలదే. ఎవరి గెలుపోటములైనా ఓటర్ల చేతుల్లోనే ఉంటాయి. మరి మీరేమంటారు?


