News April 16, 2025

RCPM: ‘రాబోయే రెండు రోజులు వరి కోతలు వద్దు’

image

రాబోయే రెండు రోజులులో వరికోతలు చేపట్టవద్దని,ఇప్పటికే నూర్చిన ధాన్యం ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రామచంద్రపురం సహాయ వ్యవసాయ సంచాలకులు ఏవి యస్ రంగారావు రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోవు రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కావున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలలో ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతు సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.

Similar News

News September 18, 2025

అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

image

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

మహబూబాబాద్: 20న జాబ్ మేళా

image

మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రజిత తెలిపారు. ఈ నెల 20న మహబూబాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రైవేటు సంస్థల వారు పాల్గొంటున్నారని, ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, గ్రాడ్యుయేట్, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవారు పాల్గొనాలన్నారు.

News September 18, 2025

అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

image

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్‌లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.