News April 16, 2025
RCPM: ‘రాబోయే రెండు రోజులు వరి కోతలు వద్దు’

రాబోయే రెండు రోజులులో వరికోతలు చేపట్టవద్దని,ఇప్పటికే నూర్చిన ధాన్యం ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రామచంద్రపురం సహాయ వ్యవసాయ సంచాలకులు ఏవి యస్ రంగారావు రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోవు రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కావున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలలో ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతు సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.
Similar News
News January 4, 2026
నయా ట్రెండ్.. పెద్ద టైటిళ్లు అయితేనేం!

టాలీవుడ్లో పెద్ద టైటిళ్ల హవా కన్పిస్తోంది. క్యాచీగా ఉంటే చాలూ సినిమా పేరు పెద్దదైనా పర్లేదంటున్నారు మేకర్లు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ కోవలోవే. అందులోనూ అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. అటు వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్(ఆదర్శ కుటుంబం హౌస్ నం.47) కూడా లెంగ్తీదే కావడం విశేషం.
News January 4, 2026
రూ.2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు

సైబర్ మోసాలకు గురైన బాధితులకు గద్వాల్ జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వివిధ కేసుల్లో పోగొట్టుకున్న రూ.2.46 లక్షలను రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మల్దకల్ పీఎస్ పరిధిలో ఓ బాధితురాలు కోల్పోయిన రూ. 1.80 లక్షల్లో, లక్ష రూపాయలను విజయవంతంగా తిరిగి ఇప్పించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
News January 4, 2026
వైకుంఠద్వార దర్శనం: తిరుమల UPDATE

AP: తిరుమల వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం 9pm వరకు కొండపై భక్తుల రద్దీ గురించి TTD అప్డేట్ ఇచ్చింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నట్లు చెప్పింది. శ్రీవారి దర్శనానికి 16గంటల వరకు టైం పడుతున్నట్లు చెప్పింది. అటు భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో స్వామివారి అభిషేకం సమయంలోనూ దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది.


