News April 24, 2025

RCPM: ఈ నెల 26,27 తేదీలలో జాబ్ మేళా

image

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఈ నెల 26,27 తేదీలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని ఉపాధి ఆఫీస్ నందు ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హత గల 18 నుంచి 35సంవత్సరాల వయసు గల అభ్యర్థులు హాజరుకావొచ్చని తెలిపారు. పరిసర ప్రాంతాల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.

Similar News

News January 9, 2026

సిరిసిల్ల : పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

image

రేపటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.

News January 9, 2026

జగిత్యాల జిల్లాలో గాలిపటాల దుకాణాలపై పోలీసుల తనిఖీలు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. చైనా మాంజా వల్ల మనుషులు, చిన్నారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో పాటు పక్షులు, పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.

News January 9, 2026

కామారెడ్డి: ఎగిరే గాలిపటం.. కావొద్దు గాయం

image

సంక్రాంతి పండుగ వేళ రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయతీ. ఈ వినోదం మూగజీవుల ప్రాణాల మీదకు రాకూడదని, మనుషుల భద్రతకు విఘాతం కలగకూడదని కామారెడ్డి జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా గాలిపటాల విక్రయ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. షాపుల్లో నిల్వ ఉంచిన మాంజా రీళ్లను పరిశీలించారు. చైనా మాంజా వినియోగం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.