News October 11, 2024
తండ్రిని పట్టించుకోని కొడుకులకు RDO షాక్

TG:వృద్ధాప్యంలో తండ్రికి నీడగా నిలవాల్సిన కొడుకులు కాదనుకున్నారు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లిలో తండ్రి రాజమల్లు పేరుతో రావాల్సిన డబుల్ బెడ్ రూమ్ను భార్య పేరుతో పెద్ద కొడుకు రాయించుకున్నాడు. 6 నెలలుగా ఇద్దరు కొడుకులూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపునింపుకుంటున్నాడు. ఇటీవల ఫిర్యాదు చేయడంతో కొడుకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని RDO తండ్రికి కేటాయించారు. ఆయనకు నెలకు ₹2000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు.
Similar News
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.
News December 28, 2025
భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<


