News April 12, 2024
ఆ పరీక్షను మళ్లీ నిర్వహించండి: హైకోర్టు

TG: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో తెలుగు, ఇంగ్లిష్లో పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఇంగ్లిష్లోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.
Similar News
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో వివరించారు.
News January 2, 2026
మొక్కజొన్నకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం.. నివారణ ఎలా?

మొక్కజొన్న తోటల్లో కత్తెర పురుగు ఉద్ధృతి పెరిగింది. ఇది మొక్క మొలక దశ నుంచే ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు మొక్కజొన్న కాండం, ఆకులను తిని రంధ్రాలను చేస్తాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచి కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తాయి. ఆకు సుడులను కూడా తింటాయి. దీని వల్ల మొక్కకు తీవ్ర నష్టం జరిగి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కత్తెర పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


