News August 19, 2024

ఇవాళ్టి నుంచి ఒంగోలు నియోజకవర్గం ఈవీఎంల రీ వెరిఫికేషన్

image

AP: ఇవాళ నుంచి ఈనెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీ వెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ రూ.5.66లక్షలు చెల్లించారు. ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజులపాటు రీ వెరిఫికేషన్ చేయనున్నారు.

Similar News

News July 7, 2025

అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.

News July 7, 2025

ఈ లక్షణాలను వెంటనే విడిచిపెట్టేయ్ మిత్రమా!

image

ప్రతి విషయానికీ ఎక్కువగా ఆలోచించే ఓ మిత్రమా.. ఇది నీకోసమే. నువ్వు మొదటగా ఈ 5 లక్షణాలను విడిచిపెడితే నీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. తొలుత అందరినీ సంతృప్తి పరచాలని అనుకోకు. జరిగినవి, జరగబోయే విషయాలపై అనవసరంగా ఆందోళన చెందకు. ముందుగా నిన్ను నువ్వు కించ పరుచుకోవడం మానేసేయ్. మార్పులకు భయపడకుండా ధైర్యంగా నిలబడు. గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టు. SHARE IT

News July 7, 2025

ఆరోగ్యం రొట్టె స్వీకరించిన లోకేశ్.. ఎందుకంటే?

image

AP: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే దాన్ని తీసుకున్నానని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. రొట్టెల పండుగ కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు లోకేశ్ వెల్లడించారు.