News October 22, 2024

లద్దాక్ విషయంలో భారత్‌తో ఒప్పందానికి వచ్చాం: చైనా

image

తూర్పు లద్దాక్ సరిహద్దు వివాదానికి ముగింపు పలికేలా భారత్‌తో ఒప్పందానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘సరిహద్దు సమస్యలకు సంబంధించి దౌత్య, సైనికపరమైన విధానాల్లో భారత్‌తో చర్చించాం. తాజాగా ఇరు పక్షాలు ఓ పరిష్కారానికి వచ్చాయి’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. గడచిన నాలుగేళ్లుగా తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 29, 2025

రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ <<>>రాష్ట్రంలో 66 సివిల్ జడ్జీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్(CBT) FEBలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1250, EWS, PwBD, SC, STలకు రూ.600. వెబ్‌సైట్: tshc.gov.in

News December 29, 2025

దేవుడు కలలో కనిపిస్తే..?

image

దైవం కలలో కనిపించడం శుభానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు దైవం కలలోకి వస్తే సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. ‘మొక్కులు మరిచిపోయినప్పుడు గుర్తుచేయడానికి, నిర్ణయాలు తీసుకోవడంలో సతమతమవుతున్నప్పుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన మన కలలో కనిపిస్తుంటాడు. ఆశీస్సులు ఇవ్వడానికి కూడా వస్తుంటాడు. అలా వస్తే.. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారని అర్థం’ అని సూచిస్తున్నారు.

News December 29, 2025

భిక్షమెత్తుతూ ఆలయానికి రూ.లక్ష, అన్నదానం

image

AP: సేవాగుణానికి చేసే పనితో సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు గొర్ర నరసయ్యమ్మ(70). తిరుపతికి చెందిన ఆమె 42 ఏళ్ల క్రితం తునికి వచ్చారు. స్థానికంగా అమ్మవారి ఆలయం వద్ద యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. సొంతవారు వదిలేయడంతో తన సంపాదనలో కొంత అన్నదానానికి బియ్యం బస్తాలు ఇవ్వడమే కాకుండా ₹లక్షను అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. దీంతో భిక్షమెత్తుతూ ఆమె చేస్తున్న సేవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.