News June 5, 2024
400 సీట్ల మార్క్ను చేరింది ఒక్కసారే..

ప్రధాని మోదీ 400 సీట్లు గెలుచుకోవాలనుకున్న కోరిక నెరవేరలేదు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఇది సాధ్యమైంది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఆ పార్టీ 48.12శాతం ఓట్లు పొందింది. సీపీఐ 22 సీట్లు సాధించి 5.71శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 7.4శాతం ఓట్లతో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి.
Similar News
News November 20, 2025
ANU: ‘మాస్ కాపీయింగ్కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
News November 20, 2025
వయసు పెరుగుతున్నా.. తగ్గేదేలే!

తెలుగు హీరోలు మహేశ్(50), నాగార్జున(66) సహా పలువురు నటులు వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్ లుక్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ముఖాల్లో ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం ‘వయసు వెనక్కి వెళ్తోందా?’ అనే చర్చకు దారితీస్తోంది. ఈ హీరోలు తమ ఫిట్నెస్, లైఫ్స్టైల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇలాంటి ‘ఏజింగ్ బ్యాక్వర్డ్స్’ లుక్ సాధ్యమవుతోందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
News November 20, 2025
గంభీర్పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్కతా పిచ్ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.


