News August 22, 2024

రియాక్టర్ పేలుడు.. మృతుల కుటుంబాలకు పీఎం పరిహారం

image

ఏపీలోని అనకాపల్లి(D) అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు <<13911204>>ఘటనపై<<>> ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు పీఎంవో తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్లు పేర్కొంది. గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Similar News

News October 15, 2025

అంతరపంటగా ‘అనప’.. ఎకరాకు రూ.10వేల ఆదాయం

image

రబీలో వేరు శనగ, జొన్న, ఆముదం, కంది పంటల్లో అంతరపంటగా సాగు చేయడానికి అనపకాయలు అనుకూలం. 60-70 రోజులకు పూతకు వచ్చి 130 రోజుల్లో పంట కాలం పూర్తవుతుంది. ఎకరాకు 1-2KGలను 90*20సె.మీ దూరం ఉండేలా గొర్రు లేదా నాగలితో విత్తుకోవాలి. ఎకరాకు 8KGల నత్రజని, 20KGల భాస్వరం, 10KGల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు సాగు ఖర్చు రూ.1,500-2K, నికర ఆదాయం రూ.10K వరకు ఉంటుంది.

News October 15, 2025

ఆస్ట్రేలియా అంటే వీరికి పూనకాలే..

image

ఆస్ట్రేలియాపై వన్డేల్లో విరాట్, రోహిత్‌లకు మంచి రికార్డులు ఉన్నాయి. అత్యధిక రన్స్ చేసిన లిస్టులో సచిన్, కోహ్లీ, రోహిత్ టాప్-3లో ఉన్నారు. సచిన్ 71 ఇన్నింగ్సుల్లో 3,077 రన్స్, 9 సెంచరీలు చేశారు. కోహ్లీ 50 ఇన్నింగ్సుల్లో 2,451, రోహిత్ 46 ఇన్నింగ్సుల్లో 2,407 పరుగులు చేశారు. విరాట్, హిట్‌మ్యాన్ చెరో 8 సెంచరీలు బాదారు. OCT 19 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లోనూ RO-KO రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News October 15, 2025

జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.