News December 15, 2024

KTRపై చర్యలకు సిద్ధం?

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతివ్వడంతో పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తోపాటు లగచర్ల ఘటన కేసుల్లోనూ ఆయనకు నోటీసులు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఆ తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటారని సమాచారం.

Similar News

News November 2, 2025

WWC ఫైనల్: వన్డేల్లో పైచేయి ఎవరిదంటే..

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో మొదలుకానుంది. వన్డేల్లో ఇప్పటిదాకా 34 మ్యాచుల్లో 2 టీమ్స్ తలపడ్డాయి. ఇందులో 20-13 లీడ్‌తో ఇండియాదే పైచేయి కావడం గమనార్హం. ఓ మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక WCలో 6 మ్యాచ్‌లు ఆడగా తలో 3 గెలిచాయి. చివరగా WWCలోనే విశాఖలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌కు కాస్త వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది.

News November 2, 2025

‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

image

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.

News November 2, 2025

ఈనెల 6న పార్వతీపురంలో మెగా జాబ్ మేళా

image

AP: పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఈనెల 6న కార్మిక& ఉపాధిశాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 6 కంపెనీలలో 740 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ , డిగ్రీ అర్హతగల 18 నుంచి 30ఏళ్ల వయసు గలవారు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.