News October 21, 2024
ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్ధం: షమీ
గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్కు దూరంగా ఉంటున్న పేసర్ షమీ తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు సిగ్నల్ ఇచ్చారు. ‘నేను హాఫ్ రన్తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. అంతకు ముందు రంజీట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News October 22, 2024
తండ్రైన భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి, అప్పుడే పుట్టిన శిశువుతో సర్ఫరాజ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. 26 ఏళ్ల సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రొమానా జహూర్ను J&Kలో వివాహమాడారు. ఇటీవల NZపై ఈ యువ సంచలనం అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
News October 22, 2024
ఆస్ట్రేలియా టూర్కు ఇండియా-A టీమ్ ఇదే
ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. రుతురాజ్ కెప్టెన్సీలోని ఈ జట్టు AUS-Aతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ (NOV 15-17) ఆడనుంది.
>> జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), అభిమన్యు ఈశ్వరన్, సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, పోరెల్, ముకేశ్, ఖలీల్, యశ్ దయాల్, సైనీ, మనవ్, తనుశ్.
News October 21, 2024
₹1,000 కోట్లకు సగం వాటా అమ్మేసిన కరణ్ జోహార్
బాలీవుడ్లో భారీ డీల్ కుదిరింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా కలిగిన కరణ్ సంస్థను నడిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్షన్స్ హౌస్లో భాగస్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ను ఉన్నత శిఖరాలకు చేర్చుతామని కరణ్ పేర్కొన్నారు.